కుక్కల దాడిలో 13 మేకల మృత్యువాత
ABN, First Publish Date - 2021-10-17T05:43:01+05:30
గాజులరేగ ప్రధాన రహదారిలో శుక్రవారం ఉదయం కుక్కలు స్వైర విహారం చేశాయి.
విజయనగరం క్రైం, అక్టోబరు 16: గాజులరేగ ప్రధాన రహదారిలో శుక్రవారం ఉదయం కుక్కలు స్వైర విహారం చేశాయి. రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడికి ప్రయత్నించాయి. కుక్కల దాడిలో బోని అప్పలరాజు, రమణమ్మలకు చెందిన 13 మేక పిల్లలు మృత్యువాత పడ్డాయి. దీంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. గత కొద్దిరోజులుగా గాజులరేగ ప్రాంతంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నా కార్పొరేషన్ యంత్రాంగం పట్టించుకోలేదు. బాధిత కుటుంబాన్ని గొర్రెల, మేకల పెంపకం దారుల జిల్లా సంఘం అధ్యక్షుడు మన్యాల కృష్ణ పరామర్శించారు.
Updated Date - 2021-10-17T05:43:01+05:30 IST