Vizag Steel Plant ప్రైవేటీకరణపై మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం
ABN, First Publish Date - 2021-07-20T22:38:58+05:30
విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. 100% ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నామని
న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. 100% ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పింది. ప్రైవేటీకరణపై రాజ్యసభలో ఎంపీ కనకమేడల ప్రశ్న లేవనెత్తగా కేంద్ర మంత్రి భగవత్ కిషన్ రావు కరాడ్ జవాబిచ్చారు.
కాగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నందున ప్రైవేటీకరిస్తున్నామని ఇప్పటికే కేంద్రనేతలు ప్రకటనలు చేశారు. దీంతో ఏపీలో నిరసనలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో అన్ని పార్టీ నేతలు పాల్గొంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. అటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా ఈ ధర్నాల్లో పాల్గొంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే ధర్నాలు కూడా నిర్వహించింది. తాజాగా టీడీపీ ఎంపీ కనమేడల విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ప్రస్తావించారు.
Updated Date - 2021-07-20T22:38:58+05:30 IST