వివేకా హత్య కేసు.. ఎర్రగంగిరెడ్డి అరెస్ట్కు రంగం సిద్ధం
ABN, First Publish Date - 2021-09-16T01:36:29+05:30
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మూడవ కీలక అనుమానితుడు ఎర్రగంగిరెడ్డి అరెస్ట్కు సీబీఐ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు
కడప: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మూడవ కీలక అనుమానితుడు ఎర్రగంగిరెడ్డి అరెస్ట్కు సీబీఐ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎర్రగంగిరెడ్డిని వైద్యపరీక్షల కోసం కడప రిమ్స్కు సీబీఐ బృందం తరలించింది. ఈ రోజు ఉదయం సీబీఐ బృందం పులివెందులకు వచ్చింది. వైఎస్ వివేకా నివాసంలో రెండవ రోజు సీన్ రీ కన్స్ట్రక్షన్ కొనసాగింది. వివేకా హత్య జరిగిన రోజున నివాసంలోకి ఎవరెవరు వెళ్లారు.. ఆరోజు రాత్రి ఎవరెవరు ఇంట్లో తిరగారు.. అనేదానికి షార్ట్ లెటర్స్తో టీషర్ట్లు వేయించి సీబీఐ బృందం రిహార్సల్స్ చేసింది. టిషర్ట్లపై సునీల్, దస్తగిరి, ఉమాశంకర్, రంగన్న పేర్లు ఉన్నట్లు సమాచారం.
Updated Date - 2021-09-16T01:36:29+05:30 IST