ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలపై వైసీపీ పాలకుల చిన్నచూపు

ABN, First Publish Date - 2021-12-02T06:30:25+05:30

వైసీపీ పాలకులు మహిళలను అడుగడుగునా చిన్నచూపు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలని టీడీపీ పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు బుద్ద నాగజగదీశ్వరరావు, పీలా గోవిందసత్యనారాయణ సూచించారు.

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న మాజీ ఎమ్మెల్యే పీలా, మాజీ ఎమ్మెల్సీ బుద్ద
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి

టీడీపీ పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు బుద్ద, పీలా


కశింకోట, డిసెంబరు 1: వైసీపీ పాలకులు మహిళలను అడుగడుగునా చిన్నచూపు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలని టీడీపీ పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు బుద్ద నాగజగదీశ్వరరావు, పీలా గోవిందసత్యనారాయణ సూచించారు. టీడీపీ మండల అధ్యక్షుడు కాయల మురళీధర్‌ అధ్యక్షతన తాళ్లపాలెంలో బుధవారం జరిగిన టీడీపీ గౌరవసభలో వారు మాట్లాడారు. చట్టసభల్లో మహిళలను తిట్టిపోస్తున్నారని, రాజధాని అమరావతి కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న మహిళలపై లాఠీచార్జి చేయిస్తున్నారని అన్నారు. శాసనసభలో సీఎం జగన్‌ సాక్షిగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతిపక్ష నేత చంద్రబాబు భార్యపై వ్యక్తిగత దూషణలకు దిగడం రాష్ట్ర ప్రజలంతా గమనించారన్నారు. వైసీపీ పాలనలో నోరు విప్పితే బూతులు మాట్లాడడం తప్ప అభివృద్ధి ఏమీ లేదన్నారు. నిత్యావసర ధరలకు రెక్కలు రావడంతో పాటు పెట్రోల్‌, డిజీల్‌ ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ఈ సందర్భంగా గౌరవసభ కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మళ్ల సురేంద్ర, కోట్ని బాలాజీ, పెంటకోట రాము, వేగి గోపి, సిదిరెడ్డి శ్రీను, ఉగ్గిన రమణమూర్తి, చెవ్వేటి గోవిందమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-02T06:30:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising