ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేయూతను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2021-06-23T05:49:55+05:30

మహిళలకు ఆర్థిక ఆసరా కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత పథకాన్ని సద్వినియోగం చేసుకుని చిన్నతరహా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని స్థానిక ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు.

చేయూత పథకం చెక్‌ను అందిస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి 

13,270 మందికి రూ.24.87 కోట్లు జమ 

పాడేరు, జూన్‌ 22: మహిళలకు ఆర్థిక ఆసరా కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత పథకాన్ని సద్వినియోగం చేసుకుని చిన్నతరహా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని స్థానిక ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణతో కలిసి రెండో విడత చేయూత పథకాన్ని ఆమె మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. పాడేరు నియోజకవర్గంలో 13,279 మందికి రూ.24.87 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారన్నారు. మహిళలకు వెలుగు ద్వారా ఆహార పదార్థాల తయారీపై తగిన శిక్షణ అందించి ఫాస్ట్‌పుడ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని, ప్రధాన మంత్రి వన్‌ధన్‌ వికాస కేంద్రాల ద్వారా గిరిజన ఉత్పత్తులకు అదనపు విలువలను జోడించి గిరిజన ఉత్పత్తుల విక్రయాలు ముమ్మరం చేయాలని   సూచించారు. ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని గిరిజన మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలన్నారు. ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుందని, చేయూత పథకాన్ని సద్వినియోగం చేసుకుని గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు కొనుగోలు చేయాలన్నారు. అనంతరం చేయూత పథకంలో భాగంగా లబ్థిదారులకు రూ.24.87 కోట్ల చెక్కను ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ అందజేశారు. ఈకార్యక్రమంలో వెలుగు ఏపీడీ మురళీ, ఎంపీడీవో నరసింహరావు, ఏఎంసీ చైర్‌పర్సన్‌ ఎం.గాయత్రిదేవీ, వెలుగు ఏరియా కో-ఆర్డినేటర్లు కె.నీలాచలం, కె.అన్నపూర్ణ, ఏపీఎం కళావతి, సర్పంచ్‌ కె.ఉషారాణి, స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T05:49:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising