తెరుచుకున్న వారపు సంతలు
ABN, First Publish Date - 2021-06-24T05:37:54+05:30
కర్ఫ్యూ నిబంధనల సడలింపుతో సుమారు రెండు నెలల తరువాత మండలంలోని కాశీపట్నం వారపు సంత అమ్మకం, కొనుగోలుదారులతో కళకళలాడింది.
కొనుగోలు, అమ్మకందారులతో కళకళ
అనంతగిరి రూరల్, జూన్ 23: కర్ఫ్యూ నిబంధనల సడలింపుతో సుమారు రెండు నెలల తరువాత మండలంలోని కాశీపట్నం వారపు సంత అమ్మకం, కొనుగోలుదారులతో కళకళలాడింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభించడంతో ప్రభుత్వం గత నెల నుంచి కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. అధికారుల ఆదేశాల మేరకు మన్యంలో వారపు సంతలను రద్దు చేశారు. కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో కర్ఫ్యూ నిబంధనలను సడలించారు దీంతో కాశీపట్నంలో బుధవారం జరిగిన సంతకు చుట్టుపక్కల గ్రామాల నుంచి గిరిజనులు తరలివచ్చారు. వ్యవసాయ, అటవీ ఉత్పత్తులను విక్రయించి, తమకు కావాల్సిన నిత్యావసర సరకులను కొనుగోలు చేసుకున్నారు.
Updated Date - 2021-06-24T05:37:54+05:30 IST