ఇంటక్ కృషితోనే ఉక్కు కార్మికులకు వేతన సవరణ
ABN, First Publish Date - 2021-10-29T04:25:04+05:30
ఇంటక్ కృషితోనే ఉక్కు కార్మికులకు వేతన సవరణ జరిగిందని స్టీల్ ఇంటక్ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ అన్నారు. స్టీల్ప్లాంట్ సెంట్రల్ స్టోర్స్ జంక్షన్ వద్ద గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
సంఘం ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్
ఉక్కుటౌన్షిప్, అక్టోబరు 28: ఇంటక్ కృషితోనే ఉక్కు కార్మికులకు వేతన సవరణ జరిగిందని స్టీల్ ఇంటక్ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ అన్నారు. స్టీల్ప్లాంట్ సెంట్రల్ స్టోర్స్ జంక్షన్ వద్ద గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్జేసీఎస్ సమావేశంలో రెండు యూనియన్లు ఉక్కు కార్మికులకు వేతన సవరణ ఒప్పంద ఎంవోయూ జరగకుండా కుటిల ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంటక్ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి పట్దుదలతో యాజమాన్యంపై చేసిన ఒత్తిడి కారణంగా ఎంవోయూ జరిగిందన్నారు. అనేకసార్లు వేతన సవరణపై సమావేశాలు జరిగినప్పటికీ కీలక నిర్ణయం తీసుకోకపోవడంతో కార్మికవర్గం ఆర్థికంగా నష్టపోయిందన్నారు. గుర్తింపు సంఘం కాలపరిమితి పూర్తయినప్పటికీ యాజమాన్యం అండతో కొనసాగుతోందన్నారు. కార్యక్రమంలో గంధం వెంకటరావు, బి.మురళీరాజు, నీరుకొండ రామచంద్రరావు, ఎండీ రఫీ, గంట్యాడ పైడిరాజు, ఎంఎన్.రెడ్డి, కొవిరి అవతారం, పీవీ నగేష్, పీవీ రమణమూర్తి, ఆర్.జగదీష్కుమార్, డి.సాహూ, గంగవరం గోపి, ఎస్.నరసింగరావు, జెర్రిపోతుల మోహన్కుమార్ పాల్గొన్నారు.
Updated Date - 2021-10-29T04:25:04+05:30 IST