ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరికొన్ని రైళ్ల రాకపోకల వేళలు మార్పు

ABN, First Publish Date - 2021-01-17T05:27:30+05:30

విశాఖ-రాయగడ, విశాఖ-పలాస మధ్య రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్ల వేళలు మార్పు చేసినట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే.త్రిపాఠి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, జనవరి 16 : విశాఖ-రాయగడ, విశాఖ-పలాస మధ్య రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్ల వేళలు మార్పు చేసినట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే.త్రిపాఠి తెలిపారు. సవరించిన కొత్త వేళలు ఈ నెల 18 నుంచి అమల్లో రానున్నాయని పేర్కొన్నారు. 

రాయగడ-విశాఖ-రాయగడ

08507 నంబరు గల ప్రత్యేక రైలు ఈ నెల 18 నుంచి ప్రతిరోజు ఉదయం 5:40 గంటలకు రాయగడలో బయలుదేరి అదే రోజు ఉదయం 10:00 గంటలకు విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08508 నంబరు గల ప్రత్యేక రైలు ఈ నెల 18 నుంచి ప్రతిరోజు సాయంత్రం 6:00 గంటలకు విశాఖలో బయలుదేరి అదేరోజు రాత్రి 10:05 గంటలకు రాయగడ చేరుతుంది. 

పలాస-విశాఖ-పలాస

08531 నంబరు గల ప్రత్యేక రైలు ఈ నెల 18 నుంచి ప్రతిరోజు ఉదయం 5:00 గంటలకు పలాసలో బయలుదేరి అదేరోజు ఉదయం 9:25 గంటలకు విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08532 నంబరు గల ప్రత్యేక రైలు ఈ నెల 18 నుంచి ప్రతిరోజు సాయంత్రం 5:45 గంటలకు విశాఖలో బయలుదేరి అదేరోజు రాత్రి 10:00 గంటలకు పలాస చేరుతుంది. 

Updated Date - 2021-01-17T05:27:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising