ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం ఆంధ్రుల ఆగ్రహం చవిచూడక తప్పదు

ABN, First Publish Date - 2021-03-09T06:49:52+05:30

కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రజల ఆగ్రహం చవి చూడక తప్పదని ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ అన్నారు

రిలే నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొన్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ 

కూర్మన్నపాలెం, మార్చి 8: కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రజల ఆగ్రహం చవి చూడక తప్పదని  ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా రక్షించాలంటూ 25 రోజులుగా ఉక్కు ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. ఎవరి కోసం ప్రైవేటీకరణ ఆగదని కేంద్రమంత్రి అనటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయానికి ఒడి గడుతున్నారని అన్నారు.

 తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్‌ మాట్లాడుతూ ఈ నెల 10న జరగబోయే జీవీఎంసీ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేిపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ దీక్షలలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు అయోధ్యరామ్‌, మంత్రి రాజశేఖర్‌, డి.ఆదినారాయణ, నీరుకొండ రామచంద్రరావు, బోసుబాబు, బూసి వెంకటరావు, బొడ్డు పైడిరాజు, మస్తానప్ప, విళ్ల రామ్మోహన్‌ కుమార్‌, వరసాల శ్రీనివాసరావు, దొమ్మేటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-09T06:49:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising