కనక మహాలక్ష్మీ అమ్మవారి ఐఎస్ఓ గుర్తింపు సర్టిఫికెట్ ఆవిష్కరణ
ABN, First Publish Date - 2021-10-18T16:52:25+05:30
నగరంలోని కనక మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం ఐఎస్ఓ 9001-2015 గుర్తింపు సర్టిఫికెట్ను మంత్రి అవంతి శ్రీనివాస్, ఈవో సోమవారం ఉదయం ఆవిష్కరించారు.
విశాఖపట్నం: నగరంలోని కనక మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం ఐఎస్ఓ 9001-2015 గుర్తింపు సర్టిఫికెట్ను మంత్రి అవంతి శ్రీనివాస్, ఈవో సోమవారం ఉదయం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీ కనక మహాలక్ష్మీ ఆలయానికి మంచి నాణ్యత ప్రమాణాలు పాటించడం వల్ల ఈ గుర్తింపు వచ్చిందన్నారు. విశాఖలో సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి, కనక మహాలక్ష్మీ ఆలయాల వల్ల నగర ప్రజలు సుభిక్షంగా, ఆనందంగా ఉన్నారని తెలిపారు. కనక మహాలక్ష్మీ ఆలయానికి వెళ్లే మార్గ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. విశాఖ నగరంలో ఎంవి మా నౌక మళ్లీ మునిగే పరిస్థితి ఉందని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని... దీని మీద నిపుణుల కమిటీ పరిశీలిచిందని తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్తో అక్కడ రెస్టారెంట్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.
Updated Date - 2021-10-18T16:52:25+05:30 IST