విశాఖ బంద్లో పాల్గొన్న ఎంపీ విజయసాయిరెడ్డి
ABN, First Publish Date - 2021-03-05T16:28:01+05:30
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది.
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. మద్దిలపాలెంలో బంద్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ ఎమ్వీవీ సత్యనారాయణ, మంత్రి అవంతి శ్రీనివాస్, మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మద్దిలపాలెం జంక్షన్లో మానవహారం నిర్వహించారు. బంద్ నేపథ్యంలో విశాఖలో స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు మూసివేశారు. నగరంలో పలు, కూడళ్ళలో వామపక్షాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు నిరసనలు కొనసాగుతున్నాయి.
Updated Date - 2021-03-05T16:28:01+05:30 IST