Visakha: విద్యుత్షాక్కు గురై అన్నదమ్ములు మృతి
ABN, First Publish Date - 2021-12-09T15:24:23+05:30
నగరంలోని ఆనందపురం మండలం ముచ్చర్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.
విశాఖపట్నం: నగరంలోని ఆనందపురం మండలం ముచ్చర్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున విద్యుత్ షాక్కు గురై ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. గండ్రేడ్డి సత్యం, గండ్రేడ్డి గురుమూర్తి పొలాల్లోకి వెళ్తుండగా పొలంలో పడివున్న వ్యవసాయ మోటర్ల లైను వైరు తగిలి షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. అన్నదమ్ముల మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Updated Date - 2021-12-09T15:24:23+05:30 IST