వేద పారాయణ ఉద్యోగాలు భర్తీ చేయాలి
ABN, First Publish Date - 2021-07-30T04:47:19+05:30
వేద పారాయణ పథక ఉద్యోగాలు భర్తీ చేయాలని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సూచించారు.
శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర
పెందుర్తి, జూలై 29: వేద పారాయణ పథక ఉద్యోగాలు భర్తీ చేయాలని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సూచించారు. రుషికేశ్లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న పీఠాధిపతిని గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. వేంకటేశ్వరస్వామి శేష వస్త్రాన్ని, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం టీటీడీ జేఈవో ధర్మారెడ్డి, ఆలయ ప్రఽధానార్చకులు వాసుదేవ వేణుగోపాలదీక్షితులు స్వామిజీతో భేటీ అయ్యారు. పలు ఽఽధార్మిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వేద విద్యాభ్యాసం పూర్తయిన పారాయణదారులు అనేక మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని స్వామిజీ తెలిపారు. ఆ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని టీటీడీ ప్రతినిధులు వెల్లడించారు.
Updated Date - 2021-07-30T04:47:19+05:30 IST