ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

ABN, First Publish Date - 2021-05-06T04:28:22+05:30

అరకులోయ-లోతేరు రహదారిలో మాదల పంచాయతీ బట్టివలస వద్ద మంగళవారం రా త్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.

బట్టివలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరకులోయ టౌన్‌, మే 5ః అరకులోయ-లోతేరు రహదారిలో మాదల పంచాయతీ బట్టివలస వద్ద  మంగళవారం రా త్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇరగాయి పంచాయతీ గతపాడు గ్రామానికి చెందిన ఒలేఖ్‌ లక్ష్మణరావు(29), మాదల పంచాయతీ నందివలస గ్రామానికి చెందిన గెమ్మెలి రాజు(28) అరకులోయలో పనులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై గ్రామానికి వెళుతుండగా బట్టివలస వద్ద  బైకు అదుపుతప్పి బోల్తా పడడంతో  ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.  సీపీఎం కమిటీ సభ్యుడు రామన్న, మాదల సర్పంచ్‌ నాగేశ్వరరావు, జనసేన నాయకుడు మాదల శ్రీరాములు  బుధవారం అరకులోయ పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-05-06T04:28:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising