రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
ABN, First Publish Date - 2021-05-06T04:28:22+05:30
అరకులోయ-లోతేరు రహదారిలో మాదల పంచాయతీ బట్టివలస వద్ద మంగళవారం రా త్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.
అరకులోయ టౌన్, మే 5ః అరకులోయ-లోతేరు రహదారిలో మాదల పంచాయతీ బట్టివలస వద్ద మంగళవారం రా త్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇరగాయి పంచాయతీ గతపాడు గ్రామానికి చెందిన ఒలేఖ్ లక్ష్మణరావు(29), మాదల పంచాయతీ నందివలస గ్రామానికి చెందిన గెమ్మెలి రాజు(28) అరకులోయలో పనులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై గ్రామానికి వెళుతుండగా బట్టివలస వద్ద బైకు అదుపుతప్పి బోల్తా పడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సీపీఎం కమిటీ సభ్యుడు రామన్న, మాదల సర్పంచ్ నాగేశ్వరరావు, జనసేన నాయకుడు మాదల శ్రీరాములు బుధవారం అరకులోయ పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-05-06T04:28:22+05:30 IST