అచ్యుతాపురంలో కరోనాతో ఇద్దరి మృతి
ABN, First Publish Date - 2021-04-23T05:25:47+05:30
కరోనా కాటుకు అచ్యుతాపురంలో గురువారం ఇద్దరు మృత్యువాత పడ్డారు.
అచ్యుతాపురం, ఏప్రిల్ 22 : కరోనా కాటుకు అచ్యుతాపురంలో గురువారం ఇద్దరు మృత్యువాత పడ్డారు. పూడిమడక రోడ్డులో ఓ యువకుడు (30) వైరస్ నిర్ధారణ కావడంతో రెండు రోజుల క్రితం విశాఖ కేజీహెచ్లో చేరాడు. చికిత్స పొందుతూ అక్కడ మృతిచెందాడు. అలాగే గాజువాక రోడ్డులో ఓ వృద్ధురాలు (72)కు కరోనా సోకడంతో గురువారం విశాఖపట్నం ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతిచెందింది. ఇదిలావుంటే, మండలంలోని పెదపాడు, ఆవసోమవరం, దుప్పితూరు, నరేంద్రపురం, తిమ్మరాజుపేట, భోగాపురం, ఇరువాడ, చోడపల్లి, దోసూరు, తంతడివాడపాలెం, చీమలాపల్లిలలో 20 మందికి కరోనా సోకినట్టు అచ్యుతాపురం, హరిపాలెం వైద్యాధికారులు తెలి పారు. వీరందరినీ హౌస్ క్వారంటైన్లో ఉంచినట్టు చెప్పారు.
Updated Date - 2021-04-23T05:25:47+05:30 IST