ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంప్రదాయబద్ధంగా మూడో విడత చందనం అరగదీత ప్రారంభం

ABN, First Publish Date - 2021-06-18T05:37:05+05:30

వరాహలక్ష్మీనృసింహస్వామికి మూడో విడతగా సమర్పించేందుకు చందనం అరగదీతను గురువారం సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చందనం అరగదీతలో పాల్గొన్న దేవస్థానం పాలక మండలి సభ్యులు

సింహాచలం, జూన్‌ 17: వరాహలక్ష్మీనృసింహస్వామికి మూడో విడతగా సమర్పించేందుకు చందనం అరగదీతను గురువారం సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా గురువారం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రభాత ఆరాధనలు జరిపాక బాంఢాగారం నుంచి గంధపు చెక్కలను ఆలయ అధికారులు బయటకు తీసి స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు చేశారు. ఆలయ నాలుగో తరగతి ఉద్యోగులు ఆచారం ప్రకారం చందనాన్ని అరగదీశారు. తొలిరోజు అరగదీతలో దేవస్థానం ట్రస్టీలు వారణాసి దినేశ్‌రాజ్‌, సూరిశెట్టి సూరిబాబు, సిరిపురపు ఆశాకృష్ణ, ప్రత్యేక ఆహ్వానితుడు గంట్ల శ్రీనుబాబు, ఈఈ శ్రీనివాసరాజులు పాల్గొన్నారు. తొలిరోజు 28 కిలోల చందనాన్ని అరగదీయగా అధికారులు బాంఢాగారంలో భద్రపరిచారు. ఏఈవో కేకే రాఘవకుమార్‌, స్థానాచార్యుడు డాక్టర్‌ టీపీ రాజగోపాల్‌, పురోహితుడు కరి సీతారామాచార్యులు, హవల్దార్‌ రాజగోపాల్‌లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. 

Updated Date - 2021-06-18T05:37:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising