స్టీల్ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలి
ABN, First Publish Date - 2021-06-17T06:05:48+05:30
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో కన్వీనర్ గంధం వెంకటరావు డిమాండ్ చేశారు.
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో కన్వీనర్ గంధం వెంకటరావు
కూర్మన్నపాలెం, జూన్ 16: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో కన్వీనర్ గంధం వెంకటరావు డిమాండ్ చేశారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేస్తున్న రిలే దీక్షలు 125వ రోజు కొనసాగాయి. బుధవారం ఈ దీక్షలలో సీఎఫ్టీయూఐ కార్మికులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో వెంకటరావు మాట్లాడుతూ స్టీల్ప్లాంట్ను నష్టాల సాకుతో ప్రైవేటీకరించడం దుర్మార్గమన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ ఉక్కు కర్మాగారంపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు జె.అయోధ్యరామ్, కె.సత్యనారాయణ, డి.సురేశ్ బాబు, రామచంద్రరావు, ప్రకాశ్, మొగిలేశ్వర్, రమణారావు, రామారావు, కృపాకర్, రాములు, డేనియల్, రాజశేఖర్, శ్రీనివాస్, రాజాబాబు, నాయక్, గంగవరం గోపి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-17T06:05:48+05:30 IST