ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలి

ABN, First Publish Date - 2021-06-17T06:05:48+05:30

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో కన్వీనర్‌ గంధం వెంకటరావు డిమాండ్‌ చేశారు.

దీక్షలలో పాల్గొన్న ఉక్కు ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో కన్వీనర్‌ గంధం వెంకటరావు 

కూర్మన్నపాలెం, జూన్‌ 16: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో కన్వీనర్‌ గంధం వెంకటరావు డిమాండ్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేస్తున్న రిలే దీక్షలు 125వ రోజు కొనసాగాయి. బుధవారం ఈ దీక్షలలో  సీఎఫ్‌టీయూఐ కార్మికులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో వెంకటరావు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ను నష్టాల సాకుతో ప్రైవేటీకరించడం దుర్మార్గమన్నారు.  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ ఉక్కు కర్మాగారంపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. పరిరక్షణ పోరాట కమిటీ  నాయకులు జె.అయోధ్యరామ్‌,  కె.సత్యనారాయణ, డి.సురేశ్‌  బాబు, రామచంద్రరావు, ప్రకాశ్‌, మొగిలేశ్వర్‌, రమణారావు, రామారావు, కృపాకర్‌, రాములు, డేనియల్‌, రాజశేఖర్‌, శ్రీనివాస్‌, రాజాబాబు, నాయక్‌, గంగవరం గోపి, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-17T06:05:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising