ఎస్ఈసీని హైకోర్టు నియంత్రించాలి
ABN, First Publish Date - 2021-03-02T06:36:06+05:30
హైకోర్టు ముందస్తు అనుమతులు లేకుండా ఎన్నికల కమిషన్ జారీ చేస్తున్న విధానపరమైన ఉత్తర్వులను నియంత్రించాలని మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు విజ్ఞప్తి చేశారు.
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు
అనకాపల్లి టౌన్, మార్చి 1: హైకోర్టు ముందస్తు అనుమతులు లేకుండా ఎన్నికల కమిషన్ జారీ చేస్తున్న విధానపరమైన ఉత్తర్వులను నియంత్రించాలని మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు విజ్ఞప్తి చేశారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమిషనర్ రాజకీయ ప్రలోభాలకు లొంగిపోయి ప్రతీ రోజూ అడ్డదిడ్డమైన ఉత్తర్వులు జారీ చేస్తున్నారన్నారు. వలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం చూస్తుంటే కమిషనర్కు మతి భ్రమించిందా? అనే అనుమానం కలుగుతోందన్నారు. ఓటరు స్లిప్పులు పంచవద్దని వారిపై ఆంక్షలు విధించడం విచారకరమని ఆయన పేర్కొన్నారు.
Updated Date - 2021-03-02T06:36:06+05:30 IST