ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-10-20T06:34:54+05:30

చిట్టివలస జూట్‌ మిల్లు యాజమాన్యంతో చేసిన ఒప్పందంలో భాగంగా అన్ని సమస్యలు తక్షణమే పరిష్కరించేలా చూడాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును కార్మిక సంఘాల నాయకులు కోరారు.

జూట్‌ మిల్లు నాయకులతో మాట్లాడుతున్న మంత్రి ముత్తంశెట్టి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమునిపట్నం, అక్టోబరు 19: చిట్టివలస జూట్‌ మిల్లు యాజమాన్యంతో చేసిన ఒప్పందంలో భాగంగా అన్ని సమస్యలు తక్షణమే పరిష్కరించేలా చూడాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును కార్మిక సంఘాల నాయకులు కోరారు. మంగళవారం రాత్రి క్యాంప్‌ కార్యాలయంలో జూట్‌ యూనియన్‌ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, మారుపేరుతో జూట్‌ మిల్లులో పనిచేసిన కార్మికులకు మిల్లు యాజమాన్యం గ్రామంలో వుండే అసలు పేరుతోనే  గ్రాట్యుటీ, నష్టపరిహారం చెల్లించిందని, పి.ఎఫ్‌., పెన్షన్‌ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మిల్లు కో ఆపరేటివ్‌ స్టోర్స్‌ కు బకాయిపడిన రూ.26.5లక్షలు వెంటనే చెల్లించాలని కోరారు.  మరో 11 సమస్యలపై మంత్రితో చర్చించారు. ఈ సమావేశంలో నాయకులు కాకర్లపూడి వెంకట వరహాలరాజు, జీరు వెంకటరెడ్డి, చిల్ల వెంకటరమణ, దల్లి అప్పలరెడ్డి, మద్దిల వెంకట గురుమూర్తి, పడాల రమణ, కొండపు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T06:34:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising