ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షీలానగర్‌ సంత స్థలం మార్పు చేయాలి

ABN, First Publish Date - 2021-05-22T05:09:15+05:30

ప్రమాదాలకు నిలయంగా మారిన షీలానగర్‌ మంగళవారపు సంత స్థలాన్ని శుక్రవారం హరిజన జగ్గయ్యపాలెం, వెంకటేశ్వరకాలనీ నాయకులు పరిశీలించారు.

షీలానగర్‌ సంత స్థలాన్ని పరిశీలిస్తున్న కాలనీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కిరెడ్డిపాలెం, మే 21: ప్రమాదాలకు నిలయంగా మారిన షీలానగర్‌ మంగళవారపు సంత స్థలాన్ని శుక్రవారం హరిజన జగ్గయ్యపాలెం, వెంకటేశ్వరకాలనీ నాయకులు పరిశీలించారు. ప్రధాన రహదారిపై ఈ సంతను నిర్వహిస్తుండడం వలన వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతోపాటు పలు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు స్పష్టం చేశారు. ఈ సంతను సమీపంలో వున్న కుంచుమాంబ మాన్యంలోకి గాని, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్దకు గాని మార్పుచేయాలని కాలనీ నాయకులు కోరుతున్నారు. ఈ సంతను వేరొక చోటకు మార్చేందుకు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి దృష్టికి తీసుకువెల్లామని, త్వరలోనే తగిన చర్యలు  చేపడతారని స్థానిక వైసీపీ నాయకుడు బోగాది సన్యాసిరావు తెలిపారు. ఈ పర్యటనలో కాలనీ నాయకులు కె సన్యాసిరావు, యు.సుందరరావు, ఎం.కుమార్‌, వి.రాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-22T05:09:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising