కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
ABN, First Publish Date - 2021-10-18T05:51:03+05:30
విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని సీఐటీయూ నగర నాయకుడు వి.కృష్ణారావు పిలుపునిచ్చారు.
సీఐటీయూ నగర నాయకుడు కృష్ణారావు
సిరిపురం, అక్టోబరు 17: విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని సీఐటీయూ నగర నాయకుడు వి.కృష్ణారావు పిలుపునిచ్చారు. విశాఖ అఖిలపక్ష, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం కొనసాగుతున్న దీక్షలు ఆదివారం నాటికి 199వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అబద్ధాలు చెప్పి ఆత్మ నిర్భర భారత్ పేరుతో కోట్లాది రూపాయలతో సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ప్రజలను మోసం చేసిందన్నారు. ఇప్పుడు మళ్లీ రూ.వంద లక్షల కోట్లతో దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతూ మొత్తం రక్షణ రంగం నుంచి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పజెబుతున్నారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ జోలికి మోదీ, బీజేపీ వస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వి.నరేంద్రకుమార్, ఆర్.పి.రాజు, డి.అప్పలరాజు, కె.కుమారి, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-18T05:51:03+05:30 IST