ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్సిజన్‌ పడకల సామర్థ్యం పెంచాలి

ABN, First Publish Date - 2021-05-11T04:19:37+05:30

ఎన్టీఆర్‌ వైద్యాలయంలో ఆక్సిజన్‌ పడకల సామర్థ్యాన్ని పెంచాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

నెహ్రూచౌక్‌ కూడలిలో ఆందోళన చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజా సంఘాల ఆందోళన

అనకాపల్లి, మే 10:
ఎన్టీఆర్‌ వైద్యాలయంలో ఆక్సిజన్‌ పడకల సామర్థ్యాన్ని పెంచాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నెహ్రూచౌక్‌ కూడలిలో సోమవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వైద్యాలయంలో 5 కేఎల్‌ కెపాసిటీ కలిగిన ఆక్సిజన్‌ సిలిండర్‌ ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న 50 ఆక్సిజన్‌ పడకల స్థాయిని 250 ఆక్సిజన్‌ పడకలకు పెంచాలన్నారు. ఎన్టీఆర్‌ వైద్యాలయాన్ని పూర్తిస్థాయి కొవిడ్‌ ఆసుపత్రిగా మార్పు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్‌ కనిశెట్టి సురేశ్‌బాబు, వ్యవసాయదారుల సహ కార వేదిక అధ్యక్షుడు చదరం నాగేశ్వరరావు, సామాజిక హక్కుల వేదిక కన్వీనర్‌ రాజాన దొరబాబు, సామాజిక న్యాయవాది శేఖరమంత్రి సాయి వెంకట లక్ష్మణరావు, సామాజిక కార్యకర్త కర్రి రాఘవనాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T04:19:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising