ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యాన్సర్‌తో టెన్త్‌ విద్యార్థి మృతి

ABN, First Publish Date - 2021-08-04T06:09:15+05:30

మండలంలోని దిబ్బపాలెంలో క్యాన్సర్‌తో పదో తరగతి విద్యార్థి దారపు అచ్చెన్నాయుడు సోమవారం సాయంత్రం మృతి చెందాడు.

దారపు అచ్చెన్నాయుడు(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


దిబ్బపాలెంలో విషాదం

పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి

చీడికాడ, ఆగస్టు 3: మండలంలోని దిబ్బపాలెంలో క్యాన్సర్‌తో పదో తరగతి విద్యార్థి దారపు అచ్చెన్నాయుడు సోమవారం సాయంత్రం మృతి చెందాడు. దిబ్బపాలెం గ్రామానికి చెందిన దారపు ఈశ్వరరావు, కొండమ్మ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు దారపు అచ్చెన్నాయుడు ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. ప్రతీ తరగతిలోను ప్రథమ స్థానంలో నిలిచేవాడు. ఈ ఏడాది పదవ తరగతి పాసైన అచ్చెన్నాయుడుకు ఆరోగ్యం బాగోలేదని విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించగా లంగ్‌ క్యాన్సర్‌ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. తొలుత అగనంపూడి ఆస్పత్రిలోను, తర్వాత హైదరాబాద్‌లోను వైద్యం చేయించిన తల్లిదండ్రులు చివరకు ముంబాయి తీసుకు వెళ్లి ఆపరేషన్‌ కూడా చేయించారు. అనంతరం నెల రోజులుగా ఇంటి వద్ద మందులు వేసుకుంటూ బాగానే ఉన్నాడు. ఇంతలో సోమవారం సాయంత్రం ఆకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, సహచర విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. సమాచారం తెలుసుకున్న మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు వెంటనే దిబ్బపాలెం వెళ్లి మృతుని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని కోరారు.  

Updated Date - 2021-08-04T06:09:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising