ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరులో టీడీపీ శ్రేణులకు రక్షణ లేదు

ABN, First Publish Date - 2021-03-02T06:33:51+05:30

చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ బుద్ద
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్‌


అనకాపల్లి, మార్చి 1: చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న దౌర్జన్యాల గురించి తెలుసుకునేందుకు జిల్లా పర్యటనకు వెళ్లిన పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును రేణిగుంట విమానాశ్రయంలో నిర్బంధించి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లాలని పోలీసు అధికారులు డిమాండ్‌ చేయడం అన్యాయమని ఖండించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినట్లే మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా గెలవాలన్న ఉద్దేశంతో చంద్రబాబును అడ్డుకున్నారని విమర్శించారు. సీఎం జగన్‌ ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారని ఆయన ఆరోపించారు. ఇటువంటి కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారని, దౌర్జన్యాలకు పాల్పడకుండా న్యాయంగా వ్యవహరించాలని జగదీశ్‌ సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు మాదంశెట్టి నీలబాబు, కొణతాల వెంకటరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-02T06:33:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising