చిత్తూరులో టీడీపీ శ్రేణులకు రక్షణ లేదు
ABN, First Publish Date - 2021-03-02T06:33:51+05:30
చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు అన్నారు.
ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్
అనకాపల్లి, మార్చి 1: చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న దౌర్జన్యాల గురించి తెలుసుకునేందుకు జిల్లా పర్యటనకు వెళ్లిన పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును రేణిగుంట విమానాశ్రయంలో నిర్బంధించి తిరిగి హైదరాబాద్కు వెళ్లాలని పోలీసు అధికారులు డిమాండ్ చేయడం అన్యాయమని ఖండించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినట్లే మున్సిపల్ ఎన్నికల్లో కూడా గెలవాలన్న ఉద్దేశంతో చంద్రబాబును అడ్డుకున్నారని విమర్శించారు. సీఎం జగన్ ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారని ఆయన ఆరోపించారు. ఇటువంటి కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారని, దౌర్జన్యాలకు పాల్పడకుండా న్యాయంగా వ్యవహరించాలని జగదీశ్ సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు మాదంశెట్టి నీలబాబు, కొణతాల వెంకటరావు పాల్గొన్నారు.
Updated Date - 2021-03-02T06:33:51+05:30 IST