‘మంగళవారం వచ్చి శుక్రవారం వెళ్ళిపోయే వ్యక్తి విజయసాయి’
ABN, First Publish Date - 2021-06-20T17:41:26+05:30
అశోక్ గజపతిరాజు కాలి గోటికి కూడా విజయసాయిరెడ్డి పనికిరారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పళ్లా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం: అశోక్ గజపతిరాజు కాలి గోటికి కూడా విజయసాయిరెడ్డి పనికిరారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పళ్లా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. విజయనగరం సంస్థానం గురించి తెలుసుకొని మాట్లాడాలని.. హైదరాబాద్ కన్నా ముందున్న సంస్థానం అని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఉత్తరాంధ్ర ప్రజలు క్షమించరు.. ఆగ్రహానికి గురికావాల్సి వస్తోందని హెచ్చరించారు. తమరు మాట్లాడే మాటలు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. మంగళవారం వచ్చి శుక్రవారం వెళ్ళిపోయే వ్యక్తి విజయసాయిరెడ్డి అని యెద్దేవా చేశారు. ఆంధ్ర యూనివర్సిటీకి సుమారు 600 ఎకరాల భూమి ఇచ్చారని..తమరు చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. అనేక విద్యా సంస్థలు నెలకొల్పి చరిత్ర వాళ్ల కుటుంబానిదని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వానికి భూముల పిచ్చి పట్టినట్టు ఉందన్నారు. ప్రగతి భారతి ట్రస్ట్లో ఊరు మీద డబ్బులు దండుకుని పెడుతున్నారని అన్నారు. అశోక్ గజపతిరాజు కుటుంబం సొంత ఆస్తులు ట్రస్ట్గా మార్చారని తెలిపారు. విజయసాయిరెడ్డి ప్రగతి భారతికి తన సొంత డబ్బులు పెట్టానని సింహాద్రి అప్పన్న మీద ప్రమాణం చేయగలరా అని పళ్లా శ్రీనివాస సవాల్ విసిరారు.
Updated Date - 2021-06-20T17:41:26+05:30 IST