ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటండి
ABN, First Publish Date - 2021-02-24T06:47:03+05:30
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని మాజీఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు కోరారు.
మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు
దేవరాపల్లి, ఫిబ్రవరి 23: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని మాజీఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు కోరారు. మంగళవారం మండలంలోని కాశీపురంలో తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భయపెట్టి రాజకీయం వైసీపీ నాయకులు ఎన్నాళ్లు చేయలేరని, ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ, టీడీపీ నాయకులు బండారురామారావు, పోతల పాత్రునాయుడు, కర్రినాయుడు, కాసుబాబు,బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-02-24T06:47:03+05:30 IST