ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుపేద కుటుంబాలను ఆదుకోండి

ABN, First Publish Date - 2021-06-19T05:49:41+05:30

రాష్ట్రంలో తెల్లరేషన్‌ కార్డు కలిగిన ప్రతీ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు డిమాండ్‌ చేశారు.

ఆర్డీవో సీతారామారావుకు వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు

అనకాపల్లి, జూన్‌ 18:
రాష్ట్రంలో తెల్లరేషన్‌ కార్డు కలిగిన ప్రతీ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆర్డీవో సీతారామారావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కరోనా మృతుల దహన సంస్కారాలకు తక్షణ సాయంగా రూ.15 వేలు అందజేయాలన్నారు. అలాగే ఆక్సిజన్‌ అందక మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వమే బాధ్యత వహించి రూ.25 లక్షలు చెల్లించాలన్నారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయాలన్నారు. నిరుపేద కుటుంబాలకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలన్నారు. అలాగే జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించి రూ.50 లక్షల బీమా వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు డాక్టర్‌ కేకేవీఏ నారాయణరావు, నాయకులు మళ్ల సురేంద్ర, మాదంశెట్టి నీలబాబు, బీఎస్‌ఎంకే జోగినాయుడు, పోలారపు త్రినాథ్‌, సంకర్ల పద్మలత, పచ్చికూర రాము, బోడి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-19T05:49:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising