ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్కు పరిరక్షణకు పోరాటాలే శరణ్యం

ABN, First Publish Date - 2021-03-03T06:23:36+05:30

పోరాటాలతోనే విజయం వరిస్తుందని సీపీఎం నాయకుడు గంగారామ్‌ అన్నారు.

రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఉక్కు ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఎం నాయకుడు గంగారామ్‌

కూర్మన్నపాలెం, మార్చి 2: పోరాటాలతోనే విజయం వరిస్తుందని సీపీఎం నాయకుడు గంగారామ్‌ అన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కూర్మన్నపాలెంలో 19వ రోజు రిలే నిరాహార దీక్షలలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ  ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేయాలని ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారని, ఆయన ఆకాంక్షలు నెరవేరకుండా ఉండాలంటే కార్మికులు ఐకమత్యంతో పోరాడాలన్నారు. రిటైర్డు టీచర్‌  తాతాజీ మాట్లాడుతూ ప్రభుత్వరంగమైన స్టీల్‌ప్లాంట్‌ను ఎలా కాపాడుకోవాలో ఆలోచించకుండా ప్రభుత్వం అమ్మకాల వైపు నడవటం బాధాకరమన్నారు. కార్మిక నేత బోసుబాబు మాట్లాడుతూ విశాఖ ఉక్కును ముంచే విధంగా కేంద్ర విధానాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు జె.అయోధ్యరామ్‌, మంత్రి రాజశేఖర్‌, డి.ఆదినారాయణ, గంధం వెంకటరావు, బొడ్డు పైడిరాజు, మస్తానప్ప, విళ్ల రామ్మోహన్‌ కుమార్‌, వరసాల శ్రీనివాసరావు, ముత్యాలు, మురళీ రాజు, దొమ్మేటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-03T06:23:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising