‘స్పందన’ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి
ABN, First Publish Date - 2021-10-26T06:11:15+05:30
స్పందనలో వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారిం చాలని ఆర్డీవో రోణంకి గోవిం దరావు వివిధ శాఖల అధికారు లకు సూచించారు.
ఆర్డీవో గోవిందరావు
నర్సీపట్నం అర్బన్, అక్టో బరు 25 : స్పందనలో వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారిం చాలని ఆర్డీవో రోణంకి గోవిం దరావు వివిధ శాఖల అధికారు లకు సూచించారు. ఇక్కడి ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో ప్రజల సమ స్యలను ఆయన నేరుగా తెలుసు కున్నారు. ప్రతి సమస్యకు పరిష్కా రం చూపేలా కృషి చేయాలని సిబ్బందినుద్దేశించి అన్నారు. డివి జన్లోని వివిధ ప్రాంతాల నుంచి 24 మంది సమ స్యలను విన్నవించారు. నక్కపల్లి మండలం సీతయ్యపాలెం గ్రామ రెవెన్యూ పరిధి సర్వే నంబరు ఒకటిలో 13 ఎకరాల భూమిని పేదలు సాగు చేసుకుంటున్నారని, వీరికి పట్టాలు అందిం చాలని బాపూజీ అనే వ్యక్తి కోరారు. రోలుగుంట మండలం లోసంగి గ్రామంలో అంగన్వాడీ కేం ద్రం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. ఇలా వివిధ సమస్యలను పలువురు వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-26T06:11:15+05:30 IST