ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యారంగ సమస్యలపై తీవ్ర నిర్లక్ష్యం

ABN, First Publish Date - 2021-07-30T06:00:02+05:30

రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శి స్తోందని ఆరోపిస్తూ గురువారం ఇక్కడి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వ హించారు.

నక్కపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయుల ధర్నా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ప్రభుత్వ తీరును తప్పుబట్టిన ఉపాధ్యాయులు

 ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో నక్కపల్లిలో ధర్నా

 తహసీల్దార్‌ రమణకు   వినతి పత్రం సమర్పణ

నక్కపల్లి, జూలై 29 : రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శి స్తోందని ఆరోపిస్తూ గురువారం ఇక్కడి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వ హించారు.  సీపీఎస్‌ రద్దు, మూడేళ్లు దాటినా పీఆర్‌సీ అమలు చేయకపోవ డం, ఆరు డీఏల బకాయిల చెల్లింపు తది తర అంశాలపై ఈ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం తహసీల్దార్‌ రమణకు వినతి పత్రం అందజేశారు. ఉద యం పది నుంచి సాయంత్రం నాలుగు వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి బి.వెం కటపతిరాజు, జిల్లా ఉపాధ్యక్షురాలు రాజాన మంగమ్మ, రాష్ట్ర కౌన్సిలర్‌ బి.శ్రీనివాసరావు, మూడు మండలాల ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు దాడిశెట్టి కొండలరావు, బి.లక్ష్మణరావు, డి.నర్సింహమూర్తి, గెడ్డం సత్యనారాయణ, పి.శ్రీనివాసరావు, కిల్లాడ శ్రీనివాసరావులతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T06:00:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising