ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పన్నకు సహస్రనామార్చన

ABN, First Publish Date - 2021-10-20T06:31:37+05:30

వరాహలక్ష్మీనృసింహస్వామికి మంగళవారం సంప్రదాయబద్ధంగా సహస్రనామార్చన జరిపారు. ఆర్జిత సేవల్లో భాగంగా ప్రభాత సేవల అనంతరం స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని భూదేవి, నీలాదేవి సమేతంగా కల్యాణమండపంలో రజిత వేదికపై అధిష్ఠింపజేశారు.

పూజలందుకున్న ఉత్సవమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాచలం, అక్టోబరు 19: వరాహలక్ష్మీనృసింహస్వామికి మంగళవారం సంప్రదాయబద్ధంగా సహస్రనామార్చన జరిపారు.  ఆర్జిత సేవల్లో భాగంగా  ప్రభాత సేవల అనంతరం స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని భూదేవి, నీలాదేవి సమేతంగా కల్యాణమండపంలో రజిత వేదికపై అధిష్ఠింపజేశారు. నృసింహ సహస్రనామావళితో స్వామికి ప్రీతికరమైన తులసీ దళాలతో అర్చనలు చేశారు. అదే వేదికపై సింహాద్రినాథునికి ఆర్జిత నిత్యకల్యాణం, గరుడసేవలను  నిర్వహించారు. భక్తులకు నిబంధనల ప్రకారం వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు. 


 చందన సమర్పణకు విరాళం

 వరాహలక్ష్మీనృసింహస్వామికి ఏడాది పొడవునా పైపూతగా ఉంచే చందన సమర్పణకు హైదరాబాద్‌ కొండాపూర్‌ ప్రాంతానికి చెందిన బుల్లితెర నిర్మాత కడియాల ప్రవీణ్‌ కుమార్‌ రూ.10,116లు ఏఈఓ కేకే రాఘవ కుమార్‌కు మంగళవారం అందజేశారు. ఆలయ నిబంధనల ప్రకారం దాతకు 200 గ్రాముల బరువుగల గంధపు కిల్లా (ముక్క)ను అందజేశారు. 

Updated Date - 2021-10-20T06:31:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising