ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
ABN, First Publish Date - 2021-07-25T05:52:53+05:30
నియోజకవర్గం పరిదిలోని పలు ఆలయాల్లో శనివారం గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
షిర్డిసాయిబాబాకు రత్నాకర్ దంపతుల పూజలు
అనకాపల్లి టౌన్/కొత్తూరు/తుమ్మపాల/కశింకోట, జూలై 24: నియోజకవర్గం పరిదిలోని పలు ఆలయాల్లో శనివారం గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గౌరీ పంచాయతన, వేల్పులవీధి షిర్డిసాయిబాబా, దేమునిగుమ్మం వెంకటేశ్వరస్వామి, దిబ్బవీధి వరహా లక్ష్మీనృసింహస్వామి, రామాలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేల్పులవీధి, ఎన్జీవోస్ కాలనీల్లోని షిర్డిసాయిబాబా ఆలయాలను వైసీపీ పార్లమెంట్ పరిశీలకుడు దాడి రత్నాకర్ దంపతులు దర్శించుకుని, స్వామివారికి పాలాభిషేకాలు చేశారు. గౌరీ పంచాయతన ఆలయంలో లక్ష్మీనారాయణుడుకి లక్ష తులసీ పత్రీ, లక్ష కుంకుమ పూజలు నిర్వహించారు. 50 మంది దంపతులు ఈ పూజల్లో పాల్గొన్నారు. అలాగే కశింకోట, చింతలపాలెం సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. తుమ్మపాల, బవులవాడ, దర్జీనగర్ షిర్డిసాయి ఆలయాల్లో వ్రతాలు జరిగాయి. నిర్వాహకులు మధ్యాహ్నం అన్నసమారాధనలు ఏర్పాటు చేశారు.
Updated Date - 2021-07-25T05:52:53+05:30 IST