మధ్యాహ్నం 2 వరకే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు
ABN, First Publish Date - 2021-05-08T05:19:27+05:30
పాక్షిక కర్ఫ్యూ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ శాఖ పనివేళల్లో కూడా మార్పులు చేస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ కె.మన్మధరావు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈనెల 18వ తేదీ వరకు ఇది అమలు
జిల్లా రిజిస్ట్రార్ కె.మన్మధరావు
విశాఖపట్నం, మే 7 : పాక్షిక కర్ఫ్యూ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ శాఖ పనివేళల్లో కూడా మార్పులు చేస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ కె.మన్మధరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లు (పనిదినాల్లో) జరగనున్నట్లు తెలిపారు. ఉదయం 11.30 నుంచి 2 గంటల మధ్య క్రయవిక్రయదారులు తప్ప సాధారణ ప్రజలు ఎవ్వరూ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి ప్రవేశించరాదని సూచించారు. కొవిడ్ దృష్ట్యా కర్ఫ్యూను దృష్టిలో పెట్టుకుని మార్చిన పనివేళలు ఈనెల 18వ తేదీ వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.
Updated Date - 2021-05-08T05:19:27+05:30 IST