రసవత్తరం... సమ్మక్క-సారలమ్మ నాటకం
ABN, First Publish Date - 2021-10-30T05:00:38+05:30
సురభి నాటకోత్సవాలు పిఠాపురం కాలనీ కళాభారతి ఆడిటోరియంలో ఉత్సాహంగా సాగుతున్నాయి. శుక్రవారం ప్రదర్శించిన శ్రీసమ్మక్క-సారలమ్మ నాటకం ఆద్యంతం రసవత్తరంగా సాగింది. మేడరాజు వేటకు వెళ్లి పులులు, సింహాలు కాపలాగా ఉన్న పాప దైవాంశసంభూతురాలని, ఆ పాపకు సమ్మక్క పేరు పెట్టి పెంచుతారు.
ఉత్సాహంగా సాగుతున్న సురభి నాటకోత్సవాలు
మద్దిలపాలెం, అక్టోబరు 29: సురభి నాటకోత్సవాలు పిఠాపురం కాలనీ కళాభారతి ఆడిటోరియంలో ఉత్సాహంగా సాగుతున్నాయి. శుక్రవారం ప్రదర్శించిన శ్రీసమ్మక్క-సారలమ్మ నాటకం ఆద్యంతం రసవత్తరంగా సాగింది. మేడరాజు వేటకు వెళ్లి పులులు, సింహాలు కాపలాగా ఉన్న పాప దైవాంశసంభూతురాలని, ఆ పాపకు సమ్మక్క పేరు పెట్టి పెంచుతారు. కరువులో తోడుగా నిలిచిన సమ్మక్కను దేవతగా కొలవడం, ఆమె హస్తవాసి వారి నమ్మకాన్ని మరింత పెంచడం, ఆమె చేతితో ఆకు పసరు ఇస్తే ఎంతటి రోగమైనా తగ్గిపోవడం వంటి సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్థులను చేశాయి. ప్రతాపరుద్రుడు మేడారంపై దండెత్తిరాగా సంప్రదాయ ఆయుధాలతో సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, నాగులమ్మ చేసిన గెరిల్లా యుద్ధాలు రక్తి కట్టించాయి. వీరోచిత పోరాటంతో తీవ్రగాయాలైన సమ్మక్క యుద్ధభూమి నుంచి నిష్క్రమించి కొంతదూరం వెళ్లాక అదృశ్యమవడం, ఆ ప్రాంతంలో పుట్ట వద్ద పసుపు, కుంకుమ భరిణె లభ్యమవడంతో సమ్మక్కగా భావించి రెండేళ్లకొకసారి జాతర చేసేవిధానం అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రంగసాయి నాటక సంఘం నిర్వహకుడు బాదంగీర్ సాయి, కళాభిమానులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-30T05:00:38+05:30 IST