ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాచపల్లి భూములను ఏపీఐఐసీ రికార్డుల నుంచి తొలగిచాలి

ABN, First Publish Date - 2021-12-15T05:59:16+05:30

మాకవరపాలెం మండలం రాచపల్లి రెవెన్యూ పరిధిలోని 500 ఎకరాలు భూములు ఏపీఐఐసీ రికార్డుల్లో నుంచి తొలగించాలని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ మంగళవారం ఆర్డీవో గోవిందరావుని కోరారు.

ఎమ్మెల్యే సమక్షంలో ఆర్డీవో గోవిందరావుకి వినతి పత్రం అందజేస్తున్న రాచపల్లి రెవెన్యూ పరిధి రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాచపల్లి భూములను ఏపీఐఐసీ రికార్డుల నుంచి తొలగిచాలి

రైతుల తరపున ఆర్డీవోకి ఎమ్మెల్యే గణేశ్‌ వినతి


నర్సీపట్నం, డిసెంబరు 14: మాకవరపాలెం మండలం రాచపల్లి రెవెన్యూ పరిధిలోని 500 ఎకరాలు భూములు ఏపీఐఐసీ రికార్డుల్లో నుంచి తొలగించాలని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ మంగళవారం ఆర్డీవో గోవిందరావుని కోరారు.  రాచపల్లి రెవెన్యూ పరిధిలోని పలువురు రైతులు తొలుత ఎమ్మెల్యేని కలిసి తమ భూముల సమస్యను వివరించారు. అనంతరం అందరూ కలిసి ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. రాచపల్లి, రామన్నపాలెం, ఎరకన్నపాలెం, ధర్మవరం గ్రామాలకు చెందిన భూములు ఏపీఐఐసీ రికార్డుల్లో ఉండడంతో భూముల క్రయవిక్రయాలకు వీలుకాక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే గణేశ్‌ చెప్పారు. ఆయా భూములను ఏపీఐఐసీ రికార్డుల్లో నుంచి తొలగించేలా చర్యలు చేపట్టాలని ఆర్డీవోని కోరారు. అనంతరం రైతులంతా కలిసి ఆర్డీవో గోవిందరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసు, పెట్ల భద్రాచలం, దొరబాబు, జమీందారు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-15T05:59:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising