ఘనంగా మాజీ ఎమ్మెల్సీ బుద్ద జన్మదిన వేడుకలు
ABN, First Publish Date - 2021-07-27T05:49:34+05:30
తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.
నాయకులు, అభిమానుల సేవా కార్యక్రమాలు
అనకాపల్లి, జూలై 26: తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. నూకాంబిక అమ్మవారిని జగదీశ్ దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు చేశారు. అలాగే ఎన్టీఆర్ వైద్యాలయంలో రోగులకు పండ్లు పంచారు. అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ అర్బన్ ఉపాధ్యక్షుడు మళ్ల సురేంద్ర ఆధ్వర్యంలో 50 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు డాక్టర్ కేకేవీఏ నారాయణరావు, బొద్దపు ప్రసాద్, బొడ్డేడ జోగినాయుడు, కుప్పిలి జగన్, మళ్ల గణేశ్, దొడ్డి జగదీశ్, శివఅప్పారావు, డీవీ అప్పారావు, పి.వెంకటరావు, కాండ్రేగుల రాజు, కర్రి మల్లేశ్వరరావు, అండిబోయిన శేషు, బుద్ద భువనేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కొత్తూరు: కూండ్రం గ్రామంలో టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు జన్మదిన వేడుకలు జరిగాయి. పార్టీ మండల అధ్యక్షుడు పచ్చికూర రాము కేక్ కట్ చేసి, జగదీశ్ ప్రజా సంక్షేమం కోసం వైపీసీ ప్రభుత్వంతో చేస్తున్న పోరాటాలను వివరించారు. ఈ నిరంతర శ్రమ జీవిగా పార్టీ అభివృద్ధికి జగదీశ్ కృషి చేస్తున్నారని సర్పంచ్ నందారపు లక్ష్మి అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎం.సత్యనారాయణ, సూరిబాబు, ఎస్.మున్సిబునాయుడు, గనిశెట్టి రాజునాయుడు, ఎస్.రామారావు, పి.నరసింగరావు పాల్గొన్నారు
Updated Date - 2021-07-27T05:49:34+05:30 IST