ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ దేశాభివృద్ధికి చేటు

ABN, First Publish Date - 2021-11-30T06:28:58+05:30

ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే దేశాభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు.

దీక్షా శిబిరంలో మట్లాడుతున్న డి.ఆదినారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, నవంబరు 29: ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే దేశాభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 291వ రోజు కొనసాగాయి. సోమవారం ఈ దీక్షలలో  ఎంఎంఎస్‌ఎం, డబ్ల్యూఆర్‌ఎం-2, ఎస్‌టీఎం, ఎస్‌బీఎం విభాగాల కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో ఆదినారాయణ మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.  విజయవాడకు చెందిన ఏపీఎస్‌ ఆర్టీసీ నాయకుడు జి.సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలతో కార్మికులు ఇబ్బందిపడుతున్నారని పేర్కొన్నారు. ఈ శిబిరంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు యు.వెంకటేశ్వర్లు, గంధం వెంకటరావు, జి.ఆనంద్‌, దేముడు, రాజు, సూరిబాబు, సుబ్బారావు, శ్రీనివాస్‌, రమణారావు, మహ్మద్‌, గంగవరం గోపి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-30T06:28:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising