ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండో విడత చందనం అరగదీతకు సన్నాహాలు

ABN, First Publish Date - 2021-05-18T05:06:58+05:30

సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో రెండో విడత చందనం అరగదీతకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

అరగదీతకు అనువుగా గంధపు చెక్కలు కోస్తున్న కార్పెంటర్‌ రమణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాచలం, మే 17: సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో రెండో విడత చందనం అరగదీతకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం సుప్రభాత సేవ, ప్రభాత ఆరాధనలు ముగిశాక దేవాలయ బాంఢాగారంలో భద్రపరిచిన మంచి గంధం చెక్కలను ఏఈవో కేకే రాఘవకుమార్‌ పర్యవేక్షణలో బయటకు తీశారు. వీటిని అవసరానికి తగ్గట్టుగా 32 కిలోలు మాత్రమే ఉండేలా.. అరగదీసేందుకు అనువుగా ఉండేలా కార్పెంటర్‌ రమణ సిబ్బంది యంత్రంతో ముక్కలుగా కోశారు. గంధపు చెక్కలను ఆలయ పురోహితుడు కరి సీతారామాచార్యులు ఆధ్వర్యంలో వైదిక సిబ్బంది పోటులోని అనంతధార నుంచి జాలువారే పవిత్ర జలాలలో నానబెట్టారు. ఈనెల 19 నుంచి రెండో విడత చందనం అరగదీతను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణాధికారి దాసరి బంగారినాయుడు, స్థానాచార్యుడు డాక్టర్‌ టీపీ రాజగోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-18T05:06:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising