ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూడిమడకలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు సన్నాహాలు

ABN, First Publish Date - 2021-05-11T05:13:41+05:30

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్నందున అచ్యుతాపురంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు అనకాపల్లి ఎంపీ సత్యవతి సుముఖత వ్యక్తం చేశారని బీజేపీ నాయకులు తెలిపారు.

పూడిమడకలో తుఫాన్‌ రక్షిత భవాన్ని పరిశీలిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


అచ్యుతాపురం, మే 10 : కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్నందున అచ్యుతాపురంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు అనకాపల్లి ఎంపీ సత్యవతి సుముఖత వ్యక్తం చేశారని బీజేపీ నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం పూడిమడకలో గల తుఫాన్‌ రక్షిత భవాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు అగ్గాల హనుమంతరావు, రాష్ట్ర కిసాన్‌ మోర్చ ఉపాధ్యక్షుడు గొంతిన భక్తసాయిరామ్‌, బీజేపీ మండల అధ్యక్షుడు రాజాన రాజు మాట్లాడుతూ  మండల ప్రజలతో పాటు సెజ్‌లో ఏర్పాటుచేసిన సుమారు 50 కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు, కూలీలు, ఉద్యోగులకు అందుబాటులో ఉండే విధంగా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఎంపీకి కోరడంతో ఈ మేరకు  ఆమె స్పందించారన్నారు.  అంతేకాకుండా సుమారు 200 పడకలకు సరిపడా భవనాన్ని పరిశీలించమని సూచించడంతో తాము ఈ పనిలో నిమగ్నమైనట్టు చెప్పారు. 

Updated Date - 2021-05-11T05:13:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising