ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పన్న స్వామి దర్శనంతో మానసిక ప్రశాంతత

ABN, First Publish Date - 2021-10-24T05:12:53+05:30

వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనంతో ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తోందని సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు.

ఆలయంలోని శిల్పకళను తిలకిస్తున్న తనికెళ్ల భరణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి

సింహాచలం, అక్టోబరు 23: వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనంతో ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తోందని సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. శనివారం ఆయన పలువురు స్నేహితులతో కలిసి సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహాకవి శ్రీశ్రీ రాసిన కవితా సంకలనంలోని ‘కవితా-ఓ కవితా’ పుస్తకావిష్కరణ, ఓ వివాహ కార్యక్రమం నిమిత్తం విశాఖ వచ్చానన్నారు. విశాఖకు ఎప్పుడొచ్చినా అప్పన్న స్వామిని దర్శించుకుని ప్రశాంతత పొందుతానన్నారు. ఆయనకు ఆలయ అధికారులు దాసరి బంగారినాయుడు, ఎస్‌.కనకరాజు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం తర్వాత ఆయన గోత్రనామాలతో అర్చకులు పూజలు చేశారు. గోదాదేవి అమ్మవారి దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనాలు, అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. పలువురు అభిమానులు తనికెళ్ల భరణితో సెల్ఫీలు దిగారు.


Updated Date - 2021-10-24T05:12:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising