పాకలపాడు చెరువు సర్వే చేస్తే నిజాలు బట్టబయలు: అయ్యన్న
ABN, First Publish Date - 2021-08-09T16:25:30+05:30
గొలుగొండ మండలంలోని పాకలపాడు పెద్ద చెరువు సర్వే..
నర్సీపట్నం: గొలుగొండ మండలంలోని పాకలపాడు పెద్ద చెరువు సర్వే చేయిస్తే.. అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని మాజీ మంత్రి సిహెచ్.అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆదివారం ఆయన స్థానిక విలేఖరులకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పెద్ద చెరువు విషయంలో ఎమ్మెల్యే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. దొంగ పాసుపుస్తకాలు సృష్టించి రూ.11 కోట్లు రుణం తీసుకున్న వైసీపీ నాయకుడుపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారో తెలియజేయాలన్నారు. దొంగ పాస్పుస్తకాలు ఇచ్చిన తహసీల్దార్పై తీసుకున్న చర్యలు ఏమిటిని ప్రశ్నించారు. నిజానిజాలు ప్రజలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎమ్మెల్యేకి ఉందని హితవు పలికారు.
Updated Date - 2021-08-09T16:25:30+05:30 IST