ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేయాలి
ABN, First Publish Date - 2021-05-12T05:17:28+05:30
కరోనా బాధితులను ఆదుకోవడానికి అనకాపల్లిలో 200 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేయాలని సీపీఎం నియోజకవర్గ కన్వీనర్ ఎ.బాలకృష్ణ డిమాండ్ చేశారు.
సపీఎం నియోజకవర్గ కన్వీనర్ ఎ.బాలకృష్ణ
అనకాపల్లి టౌన్, మే 11: కరోనా బాధితులను ఆదుకోవడానికి అనకాపల్లిలో 200 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేయాలని సీపీఎం నియోజకవర్గ కన్వీనర్ ఎ.బాలకృష్ణ డిమాండ్ చేశారు. కార్మిక కర్షక నిలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ వైద్యాలయంలో 100, రేబాక కొవిడ్ కేర్ సెంటర్లో 100 ఆక్సిజన్ పడకలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఎన్టీఆర్ వైద్యాలయంలో ఉన్న 50 ఆక్సిజన్ పడకలు ఏమాత్రం సరిపోక కొవిడ్ బాధితులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్లు కరోనా కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా ప్రజలకు సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు మళ్ల సత్యనారాయణ, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-05-12T05:17:28+05:30 IST