ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిహారాలు పొందేందుకు జూట్‌మిల్లు అప్రెంటీస్‌ కార్మికులకు అవకాశం

ABN, First Publish Date - 2021-02-26T06:08:58+05:30

చిట్టివలస జూట్‌మిల్లులో పనిచేసిన అప్రెంటీస్‌ కార్మికులకు పరిహారాలు అందించడానికి యాజమాన్యం అవకాశం కల్పించింది.

ప్రత్యేక శిబిరంలో దరఖాస్తులు స్వీకరిస్తున్న కార్మిక సంఘ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు

తగరపువలస, ఫిబ్రవరి 25: చిట్టివలస జూట్‌మిల్లులో పనిచేసిన అప్రెంటీస్‌ కార్మికులకు పరిహారాలు అందించడానికి యాజమాన్యం అవకాశం కల్పించింది. ఇంతవరకు మిల్లులో పనిచేసిన రెగ్యులర్‌ కార్మికుల నుంచి దరఖాస్తులను స్వీకరించి వారి బ్యాంకు ఖాతాలలో పరిహారాల నగదును జమ చేశారు. ఇప్పుడు అప్రెంటీస్‌ కార్మికులకు అవకాశం ఇవ్వడం వల్ల ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న వారికి ప్రయోజనం కలుగుతుందని ఐక్య కార్మిక సంఘాల నాయకులు గురువారం తెలిపారు. వీరి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు జూట్‌మిల్లు వద్ద ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఐక్య కార్మిక సంఘాలైన కాంగ్రెస్‌ కార్మిక సంఘం, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, టీఎన్‌టీయూసీ సంఘాలకు చెందిన కేవీ కైలాశ్‌రెడ్డి, దల్లి అప్పలరెడ్డి, ఎం.ఆదినారాయణ, చిల్ల రమణ, కె.అప్పలసూరి, ఎం.దేముళ్లు, కె.ఈశ్వరరావు జూట్‌మిల్లు వద్ద ఏర్పాటు చేసిన శిబిరం వద్ద దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అప్రెంటీస్‌లుగా తాము పని చేసినట్టు ఆధారాలను, ఆధార్‌ కార్డు, ఫొటో గుర్తింపు కార్డులను తమకు అందించాలని కోరారు. 

Updated Date - 2021-02-26T06:08:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising