ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-05-11T04:37:47+05:30

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడిన సంఘటన పీఎంపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

మృతుడు గవాస్కర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముగ్గురికి గాయాలు

కొమ్మాది, మే 10: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడిన సంఘటన పీఎంపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని పాడేరుకు చెందిన  పలాసి గవాస్కర్‌ (32) అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా నగరంలో నివసిస్తున్నాడు. సోమవారం ఉదయం భీమిలిలో ఉన్న పిన్నింటికి ఆటోలో వెళుతుండగా పీఎంపాలెం క్రికెట్‌ స్టేడియం జంక్షన్‌ నుంచి డ్రైవర్‌ ఆటోను రాంగ్‌ రూట్‌లో తీసుకువెళ్లడాన్ని ప్రయాణికులు గుర్తించి నిలదీశారు. దీంతో ఆటోడ్రైవర్‌ యూటర్న్‌ తీసుకుంటుండగా కొమ్మాది వైపు నుంచి నగరంలోకి వస్తున్న లారీ.. ఆటోను ఢీకొంటుదేమోనన్న భయంతో గవాస్కర్‌ అందులోనుంచి కిందకు దిగి సర్వీస్‌ రోడ్డులోని డివైడర్‌పై నిల్చొన్నాడు. అయితే అప్పటికే అదుపు తప్పిన లారీ ఆటోతో పాటు డివైడర్‌పై ఉన్న గవాస్కర్‌ను ఢీకొనడంతో ఆయన మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మరో ముగ్గురికి గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. సీఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు.

Updated Date - 2021-05-11T04:37:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising