ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షేమ పథకాల్లో ఎన్టీఆర్‌ ఆదర్శప్రాయులు

ABN, First Publish Date - 2021-01-19T06:23:25+05:30

పట్టణంలోని పార్కు సెంటర్‌, చిన్న హైస్కూలు, వేగివీధి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు.

కశింకోటలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ బుద్ద, మాజీ ఎమ్మెల్యే పీలా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ బుద్ద, మాజీ ఎమ్మెల్యే పీలా


అనకాపల్లి, జనవరి 18: పట్టణంలోని పార్కు సెంటర్‌, చిన్న హైస్కూలు, వేగివీధి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మళ్ల సురేంద్ర ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమాల్లో నాయకులు బి.మురళి, ఎం.శంకరరావు, వేగి కృష్ణ, పి.వెంకట్రావు, ఎస్‌నాయుడు, కె.తులసి, కారుబాబు, కర్రి నాయుడు, దొడ్డి జగదీశ్‌, పి.వరప్రసాద్‌, రవి, రాముయాదవ్‌ పాల్గొన్నారు.


కశింకోటలో...

కశింకోట: మండల కేంద్రంలో ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఎన్టీఆర్‌, బసవతారకం విగ్రహాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఎన్టీఆర్‌ ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నారన్నారు. అనంతరం నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉగ్గిన రమణమూర్తి, సిదిరెడ్డి శ్రీను, కాయల మురళీ, పెంటకోట రాము, వేగి గోపికృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-19T06:23:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising