ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-06-21T05:44:47+05:30

ఫార్మాసిటీలోని రాంకీ సీఈటీపీ ప్లాంట్‌ సమీపంలో శనివారం అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదంలో మృతి చెందిన రమేశ్‌,... రమేశ్‌ (ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరొకరికి తీవ్ర గాయాలు

రాంకీ సీఈటీపీ ప్లాంట్‌ సమీపంలో ఘటన

పరవాడ, జూన్‌ 20: ఫార్మాసిటీలోని రాంకీ సీఈటీపీ ప్లాంట్‌ సమీపంలో శనివారం అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి పరవాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పరవాడ జగన్నాథ వీధికి చెందిన రొంగలి రమేశ్‌(26), తాపీమేస్ర్తీగా, రావాడకు చెందిన కె.రాము (28) ప్లంబర్‌గా ఫార్మాసిటీలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే శనివారం కూడా విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోయారు. మళ్లీ రాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై ఫార్మాసిటీకి వెళ్లారు. 11.30 గంటల సమయంలో రాంకీ సీఈటీపీ ప్లాంట్‌ సమీపంలో రోడ్డుపై ఉన్న చెక్‌పోస్టు రాడ్‌ను గుర్తించక బలంగా ఢీకొట్టారు. ప్రమాదంలో ఇద్దరు రోడ్డుపై పడిపోగా రమేశ్‌ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రాము తలకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రమేశ్‌ మృతదేహానికి కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి ఆదివారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పరవాడ సీఐ ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-06-21T05:44:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising