ఏఎంసీ పాలకవర్గం ప్రమాణస్వీకారం
ABN, First Publish Date - 2021-10-29T05:45:59+05:30
స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం చైర్మన్గా చిటికెల భాస్కరనాయుడు గురువారం పదవీ ప్రమాణస్వీకారం చేశారు.
ఏఎంసీ చైర్మన్ భాస్కరనాయుడు దంపతులను సత్కరిస్తున్న ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్గణేశ్
చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన చిటికెల భాస్కరనాయుడు
నర్సీపట్నం, అక్టోబరు 28: స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం చైర్మన్గా చిటికెల భాస్కరనాయుడు గురువారం పదవీ ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్గణేశ్ ముఖ్యఅతిథిగా హాజరై భాస్కరనాయుడు దంపతులతోపాటు వైస్ చైర్మన్ మళ్ల గణేశ్, పాలకవర్గం సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి, మాజీ వైస్చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-29T05:45:59+05:30 IST