ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్థానిక ఎన్నికల్లో విజయానికి కృషిచేయాలి

ABN, First Publish Date - 2021-01-20T06:07:49+05:30

రానున్న స్థానిక ఎన్నికల్లో విజయానికి పార్టీ శ్రేణులు ఐక్యంగా కృషిచేయాలని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


టీడీపీ శ్రేణులకు మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ పిలుపు 


హుకుంపేట, జనవరి 19: రానున్న స్థానిక ఎన్నికల్లో విజయానికి పార్టీ శ్రేణులు ఐక్యంగా కృషిచేయాలని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. మంగళవారం హుకుంపేట, డుంబ్రిగుడ, పెదబయలు, అరకులోయ మండలాల నాయకులతో దాలిగుమ్మడిలో నిర్వహించిన సమావేశంలో ఆయన  మాట్లాడారు. ప్రజలు, కార్యకర్తల సమస్యలను నాయకులు తెలుసుకొని, వాటి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. అలాగే మండల కమిటీల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని, మండల అధ్యక్ష, పదవులను యువతకు కేటాయించాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో తీసుకువెళ్లాలన్నారు. అనంతరం టీడీపీ నేతలు సివేరి అబ్రహం, సివేరి దొన్నుదొర, నియోజకవర్గ పరిశీలకుడు లొడగల కృష్ణ మాట్లాడారు. ఈకార్యక్రమంలో టీడీపీ నేతలు శెట్టి లక్ష్మణుడు, బాకురు వెంకటరమణరాజు, నాగేశ్వరరావు, శెట్టి అప్పాలు, కంబిడి సుబ్బారావు, పాండురంగస్వామి, బొడ్డా శ్యామ్‌, సాగరి సుబ్బారావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-20T06:07:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising