ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి

ABN, First Publish Date - 2021-02-01T06:41:16+05:30

పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని విశాఖ రేం జ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు కోరారు.

తుమ్మపాలలో మాట్లాడుతున్న విశాఖ రేంజ్‌ డీఐజీ రంగారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు

తుమ్మపాల, జనవరి 31: పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని విశాఖ రేం జ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు కోరారు. ఆదివారం రాత్రి తుమ్మపాలలో  సర్పంచ్‌, వార్డు మెంబర్ల పదవులకు నామినేషన్లు వేసిన అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పోలింగ్‌ సమయంలో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోను పోలీస్‌ కేసులకు తావులేకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఎన్నికల వరకు రాజకీయాలు  పరిమితమని, తరువాత ప్రతి ఒక్కరూ కుటుంబం లా ముందుకు సాగాలన్నారు. అభ్యర్థులు ప్రజాతీర్పును గౌరవించాలన్నా రు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసులు తప్పవని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్‌ నిఘా ఉంటుందన్నారు.  బవులవాడ, మామిడిపాలెంలో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు పర్యటించి గ్రామస్థులతో మాట్లాడారు. కార్యక్రమంలో డీఎస్పీ కె.శ్రావణి, సీఐలు ఎల్‌.భాస్కరరావు, శ్రీనివాసరావు, ఎస్‌ఐలు రామకృష్ణ, ధనుంజయ్‌, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-02-01T06:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising