ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోకేష్‌పై ఎంపీ Vijayasaireddy ఘాటు వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2021-11-14T19:13:19+05:30

టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్‌పై ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్‌పై ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సోషల్ మీడియా అడ్వయిజర్ సలహాతో  లోకేష్ బాడీ లాంగ్వేజ్, మాట్లాడే పదజాలం సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు. అడవుల్లో నివసించే, ఆది మానవుల ప్రవర్తన.. అసభ్యకరమైన భాషలు మాట్లాడితే ప్రజలు హర్షించరని తెలిపారు. ‘‘లోకేష్ పదజాలం చూస్తే రాజకీయాలకు అర్హుడా... ఈ సమాజంలో పుట్టాడా.. అమెరికాలో ఎంబీఎ చదివాడా.. ఇవన్నీ బోగస్ డిగ్రీలా.. నీకేమైనా మతి భ్రమించింది’’ అనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. 2024కి తెలుగుదేశం పార్టీ ఉండదని ఎంపీ అన్నారు. పెద్ద నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని... చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంతర్ధానమైపోతుందని అన్నారు. అనంతపురం, కుప్పంలో టీడీపీ డబ్బులు పంపిణీ చేస్తోందని ఆరోపించారు. ఉప ఎన్నికల విషయంలో టీడీపీ ధర్మ విరుద్ధంగా వ్యవహరించింది కాబట్టే వైసీపీ అన్ని చోట్ల పోటీ చేస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఆదివారం ఎంపీ విజయసాయి సమక్షంలో పలు వార్డుల్లో చెందిన టీడీపీ, బీజేపీ మరికొంతమంది నేతలు వైసీపీలో చేరారు. 

Updated Date - 2021-11-14T19:13:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising